Yadagirigutta Yadadri LIVE updates on https://www.facebook.com/yadagirigutta - watch & subscribe మన యాదాద్రి యూట్యూబ్ చానల్

Wednesday, July 30, 2025

No Direct Bus to Yadagirigutta Uphill | No Online Booking for Yadagirigutta Bus | కొండపైకి నేరుగా బస్సు ఏది? ఆన్ లైన్ టికెట్ బుకింగ్ ఏది?

యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం, కుంభాభిషేకం తరువాత కొండపైన పెద్దగా నిర్మించిన బస్ స్టాండ్ కి రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు వస్తాయని అందరూ అనుకున్నారు. YTDA ప్లాన్ ప్రకారం కూడా రాష్ట్రం లోని కొన్ని పట్టణాలనుంచి యాదగిరి కొండపైకి నేరుగా బస్సులను నడపాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఇవ్వన్నీ పక్కన పెట్టి, కొండపై ఉన్న బస్టాండ్ ను పార్కింగ్ కి, దుకాణాల సముదాయనికి వాడుకోవడం విడ్డూరంగా ఉందని భక్తులు, స్థానిక ప్రజలు అనుకుంటున్నారు. 

గతంలో హైదరాబాద్ నగరం నుంచి ప్రతి రోజు యాదగిరిగుట్ట కు ఏసి బస్సులు కొండ క్రింది బస్టాండ్ వరకు వచ్చేవి. అలాగే నగరం నుంచి కొండపైకి నేరుగా వజ్ర మిని ఏసి బస్సులు నడిచేవి, వీటికి ఆన్ లైన్ లో టికిట్ బుకింగ్, సీట్ సెలక్షన్ ఉండేది. ఇది భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉండడం తో వాళ్ళు ఆన్ లైన్ లోనే బుకింగ్ చేసుకొని వచ్చి పోయే వారు. కరొన లాక్ డౌన్ లో రద్దు అయిన ఈ సర్వీసులు ఇంతవరకు మళ్ళీ మొదలు కాలేదు. 

తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం ఇతర బస్సులకు కల్పించింది. కానీ, యాదగిరిగుట్ట కు వచ్చే బస్సులకు ఎలాంటి ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుడు అప్డేట్ అవుతున్న సంస్థలు కాక పోవడం విచారకరమనీ ప్రయాణికులు అనుకుంటున్నారు. సీట్ల కోసం ఫీట్లు చేసే ప్రయాణికులని, సీట్ల కోసం కొట్టుకునే వారిని మనం తరచుగా బస్సులో, బస్టాండ్ లలో చూస్తున్నాం. కొండపై బస్టాండ్లో, యాదగిరిగుట్ట బస్టాండ్ లో కూడా ఇలాంటి సంఘటనలు మనం వార్తల ద్వారా చూశాం. ఆల్ లైన్ బుకింగ్ తో వీటన్నటికి చెక్ పెట్టె అవకాశముంటుంది అని విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుత పరిస్తితులకు అనుగుణంగా కొండపైకి నేరుగా బస్సులను నడిపే అంశాన్ని,  ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యంతో రాష్ట్రం లోని ముఖ్య పట్టణాల నుంచి మిని లగ్జరీ, డీలక్స్ బస్సుల ను నడిపే అంశాన్ని పరిశీలించి, ప్రారంబించాలని భక్తులు కోరుకుంటున్నారు.

గతంలో కొండపైకి నడిచిన వజ్ర బస్సులను చిత్రాలలో చూడవచ్చు. 

Read more...

Tuesday, March 18, 2025

Miss Universe Victoria Kjær Theilvig Visits Yadagirigutta | మిస్ యూనివర్స్ విక్టోరియా క్లార్ యాదగిరిగుట్ట సందర్శన

యాదగిరిగుట్ట, తెలంగాణ – ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మిస్ యూనివర్స్ 2024 విక్టోరియా క్లార్ నేడు యాదగిరిగుట్టను సందర్శించారు. ఈ సందర్శనలో  ఆమె స్వామి వారి దర్శనం చేసుకొన్నారు. ఆలయ అధికారులు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ వో భాస్కర్ రావు ఆలయ చరిత్ర, విశిష్టతలను ఆమెకు తెలియ చేశారు.

డెన్మార్క్ దేశస్తురాలైన విక్టోరియా క్లార్,  ఇటీవల  2024 మిస్ యూనివర్స్ హోదాను సాధించిన ప్రముఖ సౌందర్య రాణి, భారతదేశంలోని సంప్రదాయ మరియు ధార్మిక ప్రదేశాలను సందర్శించడం కోసం భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆమెకు యాదగిరిగుట్ట ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగింది. ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమె యాదగిరిగుట్టలో పూజలు నిర్వహించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు.  

యాదగిరిగుట్ట ను సందర్శించిన మొట్ట మొదటి విశ్వ సుందరిగా విక్టోరియా క్లార్ ఆలయ రికార్డులో నిలుస్తారు. ఆమె సందర్శన ఆమె తో పాటు అక్కడ ఉన్న భక్తులకు, స్థానికులకు ఒక మరిచిపోలేని అనుభూతి గా నిలుస్తుందండంలో అతిశయోక్తి లేదు. 

#yadadri #yadagirigutta #Telangana #MissUniverse #missuniversedenmark2024 #MissUniverse2024 #VictoriaKjærTheilvig





Read more...

Thursday, January 30, 2025

Yadagirigutta Trust Board Appointment may be delayed

<> టీటీడీ త‌ర‌హాలో విధివిధానాలు తయారు. 

<> మార్పులు సూచించిన సిఏం 

<> ఆలస్యం కానున్న బోర్డు నియామకం


ఎపుడెపుడా అని ఎదురుచూస్తున్న వారికి నిరాశాజనకమైన వార్త. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు విషయంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) త‌ర‌హాలో విధివిధానాలు రూపొందించి తొందరగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటుకు అధికారులు రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సూచించారు. యాద‌గిరిగుట్ట పాలక మండలి నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ముఖ్య‌మంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో స‌మీక్షించారు.  దీంతో యాదగిరిగుట్ట దేవస్థాన పాలకమండలి ఏర్పాటు అలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
యాద‌గిరిగుట్ట ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆల‌య ప‌విత్ర‌తకు భంగం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నియామ‌కంతో పాటు ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, ధార్మిక సేవా కార్య‌క్ర‌మాల‌పై ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు ముఖ్య‌మంత్రి ప‌లు మార్పులు సూచించారు. స‌మీక్ష‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్‌, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 #SriLakshmiNarasimhaSwamyvariDevasthanam #YADAGIRIGUTTA #YADADRI #MANAYADADRI #REVANTHREDDY

Read more...

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP